
ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. రన్ వేపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో మిన్నియాపోలిస్ -సెయింట్ పాల్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలను రద్దు చేశారు. దక్షిణ డకోటాలో అతిపెద్ద నగరమైన సియోక్స్ ఫాల్స్ లోనూ విమానాశ్రయాన్ని వరుసగా రెండోరోజూ మూసేశారు. మిన్నియాపోలిస్ లో శనివారం రాత్రి 33 సెంటిమీటర్ల మంచు కురిసింది.వర్షాలు భారీగా కురుస్తుండటంతో యాంకీస్ , టైగర్స్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మిన్నెసోటా, విస్కాన్సిన్ , మిచిగాన్ మీదుగా న్యూయార్క్ , న్యూఇంగ్లాండ్ ను తుపాను తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు.