
అలా వెతుకుతున్న సమయంలోనే.. ఓ తోటలో వారికి మహిళ వాటిబా చెప్పులు కనిపించాయి. వాటి జాడ ఆధారంగా వెళితే.. అతి పెద్ద అనకొండ కనిపించింది. అది 23 అడుగులు ఉంది. కదలటం లేదు. కడుపు అంతా లావుగా ఉంది. గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే దాన్ని బంధించారు. పొట్టకోసి చూశారు. అందులో వాటిబా మృతదేహం ఉంది. అందరూ షాక్ అయ్యారు. 20, 25 అడుగుల పొడవు ఉన్న కొండచిలువులు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయంటున్నారు. పశువులపై దాడి చేసి తింటాయని.. మొదటిసారి ఇలా మనిషిని మింగటం జరిగిందంటున్నారు స్థానికులు.