
పోలీసులు అన్ని దారుల నుంచి ఎంక్వయిరీ మొదలుపెట్టటం, పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా వార్త రావటంతో కిడ్నాపర్లు అలర్ట్ అయ్యారు. పసికందును.. బీదర్ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వదిలి వెళ్లిపోయారు. ఏడుస్తున్న పాపను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది విచారణ చేస్తే.. ఆస్పత్రిలో ఎవరికీ సంబంధం లేదని తేలిసింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హైదరాబాద్ నుంచి వెళ్లిన పోలీస్ టీంకి విషయాన్ని చేరవేశారు. వారు ఆస్పత్రి దగ్గరకు వచ్చి.. పాపను గుర్తించారు. హైదరాబాద్ లో కిడ్నాప్ అయిన చిన్నారిగా నిర్ధారించారు. ఆ వెంటనే బీదర్ పోలీసులు.. హైదరాబాద్ పోలీసులకు ఆ పాపను అందించారు. మరికాసేపట్లో ఆ చిన్నారి హైదరాబాద్ బయలుదేరుతుంది. రాత్రికి తల్లి ఒడికి చేరనుంది.