
అయితే భార్యకు ఉద్యోగం ఉండగా..రమణారెడ్డి ఖాళీగా ఉండటంతో..తనను చిన్నచూపు చూస్తోందని భావించి, బుధవారం (ఏప్రిల్-11) స్కూల్ కి వచ్చాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఓ రూమ్ లో మాట్లాడుకుంటుండగా..కోపంతో రమణారెడ్డి, భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా..మిగతా టీచర్లు రావడంతో.. రమణారెడ్డి తయ చేతిలో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ గ్రామస్థులు ఆస్పత్రికి తరలించిగా.. కన్యాకుమారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు డాక్టర్లు.