
అనంతరం జరిగిన సమావేశంలో రంగరాజన్ మాట్లాడుతూ.. 2 వేల 700 ఏళ్ల నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కుల ఆధారిత సమాజంలో దళితులు నేటికీ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ఇది అంకురార్పణ మాత్రమేనని చెప్పారు. దళితులు ఆలయ ప్రవేశం చేయడంతోపాటు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
పూర్వం తమ ఊళ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలోకి తమను అనుమతించేవారు కాదని ఆదిత్య పరాశ్రీ తెలిపారు. తాను జంధ్యం వేసుకుని వేదాలను ఆచరించాలన్న సంకల్పంతో మహారాష్ట్రలోని సిద్ధేశ్వరస్వామిని ఆశ్రయించి జ్ఞానసాధన చేశానని చెప్పారు. స్వగ్రామంలో చిన్న ఆశ్రమం ఏర్పాటుకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.