
టీడీపీ ఎంపీ గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారని.. ఇది సొంత ఎజెండాతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నే అవమానిస్తున్నట్లు ఉందన్నారు. టీఆర్ఎస్ ఎంపీలకు పోటీగా టీడీపీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. కొద్దిసేపు రెండు పార్టీల ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. మీకు సమయం ఇచ్చినప్పుడు మీ వాదన వినిపించండి అని స్పీకర్ సుమిత్ర మహాజన్.. జితేందర్రెడ్డికి సూచించారు.