
చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థకి చెందిన ఓ బస్సు డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ బస్సుని నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం(జులై-1) ఆవడి నుంచి తిరువాన్మ్యూర్ వైపుగా కార్పొరేషన్ బస్సు(నెంబర్- 47D) వెళుతోంది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్ అంబత్తూర్ ప్రాంతంలో వస్తుండగా పత్రికను స్టేరింగ్పై చదువుతూ బస్సు నడుపుతున్నాడు. ఇది చూసి ఆందోళన చెందిన ప్రయాణికులు అతన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని తెలుస్తుంది.
బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫోన్లో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. దీనిపై స్పందించిన ఆ రవాణ సంస్థ అధికారి… బస్సు అంబత్తూర్ బస్సు డిపోకి చెందిందని… డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.