
గతంలో ఒక్కో ఫుల్ బాటిల్పై రూ.5 నుంచి రూ.300 వరకు రేట్లు పెరిగాయి. ఎక్సైజ్ కమిషనరేట్ స్థాయిలోనే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు. కానీ… ఈసారి పెంపునకు ప్రధాన కారణం సప్లయర్లే. మద్యాన్ని సరఫరా చేసినందుకు తమకు చెల్లించే రేట్లను పెంచాలంటూ కొంత కాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రేట్లు కచ్చితంగా పెరగనున్నాయంటున్నాయి ఎక్సైజ్ వర్గాలు.