
గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సహారా, బిర్లా నుంచి మోడీ అంచం తీసుకున్నారని ఆరోపణలున్నాయి. గతంలో నవంబర్ 14న విచారణ సందర్భంగా కూడా కోర్టు ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది. అయితే తాజాగా సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్పై మరోసారి కోర్టు విచారణ జరిపింది. సహారా, బిర్లా డైరీలు సాక్ష్యాలేవీ చూపకున్నా.. వీటి ఆధారంగా అందులో ఉన్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ వాదించారు.
అయితే ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. కార్పొరేట్స్ నుంచి మోడీముడుపులు తీసుకున్నట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఇలాంటి పత్రాలను లీగల్ ఎవిడెన్స్గా పరిగణిస్తే దేశ భద్రతకే ముప్పని అన్నారు. 2013, 2014లలో సీబీఐ, ఐటీ శాఖ అధికారులు సహారా, బిర్లా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి సేకరించిన పత్రాలనే సహారా డైరీలుగా పరిగణిస్తున్నారు. అందులో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్తోపాటు పలు ఇతర పార్టీల నేతల పేర్లు ఉన్నాయి.